BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 31 August 2026, 08:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మదనపల్లెలో పీజీఆర్‌ఎస్‌కు భారీ స్పందన..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:13 PM
10 వీక్షణలు

మదనపల్లెలో పీజీఆర్‌ఎస్‌కు భారీ స్పందన.. 316 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

గడువులోపు నాణ్యమైన పరిష్కారాలు అందించాలి.. అధికారులకు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలు

మదనపల్లె జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు.

పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి అర్జీలు పెండింగ్‌లో లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ సేవలపై నమ్మకం పెంపొందించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 316 అర్జీలు అందాయి. వీటిలో ప్రధానంగా అంగళ్లలో తాగునీటి సమస్య, రేషన్‌ షాప్‌ ఏర్పాటు, భూ వివాదాలు తదితర సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం ఎండార్స్ చేశారు.

ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే అభిప్రాయాల్లో జిల్లా మెరుగైన స్థానంలో నిలిచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ అధికారి తమ శాఖ పనితీరును సమీక్షించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌తో పాటు రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందే అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.