www.ntodaynews.com
మదనపల్లి కొత్త MROగా మాధవి బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మదనపల్లి...
మదనపల్లి మండల నూతన తహశీల్దార్ (MRO)గా మాధవి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) బాలసుబ్రహ్మణ్యం మరియు కార్యాలయ సిబ్బంది పూలబొక్కే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు, అలాగే నూతన బాధ్యతలు చేపట్టినందుకు గాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన MRO మాధవి మాట్లాడుతూ.. మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.