BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ కోసం ముమ్మరంగా స్థల పరిశీలన....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 06:05 PM
84 వీక్షణలు

మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ కోసం ముమ్మరంగా స్థల పరిశీలన....

మదనపల్లిలో అత్యాధునిక వసతులతో కూడిన నూతన టమాటా మార్కెట్ యార్డ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు, ఈ రోజు సబ్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థలాలను పరిశీలించారు.

నూతన మార్కెట్ యార్డ్ కోసం సుమారు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు మూడు ప్రధాన ప్రాంతాలను పరిశీలించారు..

1.బైపాస్ రోడ్డులో పి.పి.ఆర్ కళ్యాణ మండపానికి ఎదురుగా ఉన్న సుమారు 30 నుండి 40 ఎకరాల స్థలం.

2. శాంటోరియం సమీపంలోని మెడికల్ కాలేజీకి దక్షిణ భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న డి.కె.టి సాగు భూములు.

3.పోతుబోలు రోడ్డులో అందుబాటులో ఉన్న సుమారు 40 ఎకరాల స్థలం.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ  , సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి , మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరామ్ ,

మార్కెట్ యార్డ్ సెక్రటరీ జగదీష్, డైరెక్టర్ లక్ష్మీపతి, మండల సర్వేయర్ చక్రపాణి, సర్వేయర్ సుబ్రహ్మణ్యం , వి.ఆర్.ఓ నారాయణ, వి.ఆర్.ఓ నాగరాజు, మరియు డి.టిలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మదనపల్లి టమాటా మార్కెట్ కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, రైతులకు మరియు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ పరిశీలన నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వానికి అందజేయనున్నారు.