మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ డ్రైవ్–2 అడ్మిషన్లు ప్రారంభం
మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ డ్రైవ్–2 అడ్మిషన్లు ప్రారంభం
మధిర, ఆగస్టు 4: ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేస్–2 అడ్మిషన్ ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి వెల్లడించారు.
ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఆగస్టు 6 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత దశల్లో వివిధ కారణాలతో దోస్త్లో నమోదు చేసుకోలేకపోయిన విద్యార్థులకు ఇది చివరి అవకాశం కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ దశలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కాలర్షిప్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్కాలర్షిప్ పొందాలనుకునే వారికి ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు.
కళాశాలలో బీకాం కోర్సులో కేవలం మూడు సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. పీహెచ్డీ, సెట్, నెట్ అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు:
ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి – 9440257256
వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ – 9441786508
దోస్త్ సమన్వయకర్త డా. ఎస్. ఇందిర – 9553359879
డా. పి. సుజాత – 9177734879