BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ డ్రైవ్–2 అడ్మిషన్లు ప్రారంభం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 03:45 PM
32 వీక్షణలు

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ డ్రైవ్–2 అడ్మిషన్లు ప్రారంభం

మధిర, ఆగస్టు 4: ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేస్–2 అడ్మిషన్ ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి వెల్లడించారు.

ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆగస్టు 6 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత దశల్లో వివిధ కారణాలతో దోస్త్‌లో నమోదు చేసుకోలేకపోయిన విద్యార్థులకు ఇది చివరి అవకాశం కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ దశలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్కాలర్‌షిప్ పొందాలనుకునే వారికి ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు.

కళాశాలలో బీకాం కోర్సులో కేవలం మూడు సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. పీహెచ్‌డీ, సెట్, నెట్ అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు:

ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి – 9440257256

వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ – 9441786508

దోస్త్ సమన్వయకర్త డా. ఎస్. ఇందిర – 9553359879

డా. పి. సుజాత – 9177734879