BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మధిర రైతు వేదికలో విత్తనమేళా ప్రారంభం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 09:05 PM
31 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మధిర రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తనమేళాను సోమవారం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్-నీనో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పెసర, మినుము, కంది, బొబ్బర్లు, నువ్వులు, జొన్నలు, వివిధ కూరగాయల పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అందుబాటులో ఉంచిందని తెలిపారు.

జూలై 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే విత్తనమేళాను రైతులు సద్వినియోగం చేసుకుని అవసరమైన విత్తనాలను పొందాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, ఏడీఏ వాణిశ్రీ, ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త నాగ స్వాతి, వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్, ఉద్యానవన అధికారి విష్ణు, మండల ఏఈవోలు, ప్రజాప్రతినిధులు, రైతులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.