మధిర రైతు వేదికలో విత్తనమేళా ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మధిర రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తనమేళాను సోమవారం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్-నీనో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పెసర, మినుము, కంది, బొబ్బర్లు, నువ్వులు, జొన్నలు, వివిధ కూరగాయల పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అందుబాటులో ఉంచిందని తెలిపారు.
జూలై 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే విత్తనమేళాను రైతులు సద్వినియోగం చేసుకుని అవసరమైన విత్తనాలను పొందాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, ఏడీఏ వాణిశ్రీ, ఏఆర్ఎస్ శాస్త్రవేత్త నాగ స్వాతి, వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్, ఉద్యానవన అధికారి విష్ణు, మండల ఏఈవోలు, ప్రజాప్రతినిధులు, రైతులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.