BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 31 August 2026, 07:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో దివీస్ ల్యాబొరేటరీస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు.. రేపే నిర్వహణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 07:13 PM
18 వీక్షణలు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర:

మధిర పట్టణంలోని శ్రీనిధి డిగ్రీ కళాశాలలో దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ వై. అనిల్ కుమార్ నెహ్రు తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, బీఎస్సీ (కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ), బీ ఫార్మసీ, బీటెక్, ఎంఎస్సీ, ఎం ఫార్మసీతో పాటు బీకాం, బీఎస్సీ, బీఏ విద్యార్హతలు కలిగి ఉండాలని నిర్వాహకులు తెలిపారు.

అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. అర్హత కలిగిన యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.

ఇంటర్వ్యూ వివరాలు:

స్థలం: శ్రీనిధి డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలో, అంబర్‌పేట్ రోడ్, మధిర

తేదీ: 01-09-2026

సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

అభ్యర్థులు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు.