www.ntodaynews.com
మధ్యాహ్నం 3 గంటలకు యశోదా ఆస్పత్రికి కేసీఆర్
తెలంగాణ
హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లనున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అంతకుముందు ఉదయం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.