మధిర: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి
తెలంగాణ
/
ఖమ్మం
మధిర పట్టణ పరిధిలోని మోటమర్రి ఆర్సీఎం చర్చి సమీపంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని 528/4-6 కిలోమీటర్ వద్ద గుండాల నరసింహారావు (నివాసం వివరాలు తెలియాల్సి ఉంది) వ్యక్తిగత కారణాలతో గూడ్స్ రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనపై ఖమ్మం రైల్వే పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్. వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.