తిరువూరు: జాతీయ లోక్ అదాలత్లో 6,172 కేసుల పరిష్కారం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. తిరువూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు, రెండు అదనపు సివిల్ కోర్టుల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి అట్లూరి సిందూర పర్యవేక్షణలో లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సివిల్, క్రిమినల్కు సంబంధించిన 172 కేసులతో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన సుమారు 6,000 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులు పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదికగా నిలిచిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.
కార్యక్రమంలో సహాయ ప్రభుత్వ న్యాయవాది షేక్ బడేమియా, తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దనరావు, ప్రధాన కార్యదర్శి జి. కృష్ణారెడ్డి, అదనపు ప్రభుత్వ న్యాయవాది దారా మాధవరావు, లోక్ అదాలత్ సభ్యుడు షేక్ సుభాని, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.