మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..
మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..
పుంగనూరు రూరల్ మహానాడు గ్రాండ్ సక్సెస్...
పసుపు జెండా లతో ముస్తాబు అయిన సభ ప్రాంగణం...
అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం లో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ను పుంగనూరు మండలం ఈడిగ పల్లి భీమినేని రెస్టారెంట్ నందు క్లస్టర్ 2 పరిధిలో టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు,మోహన్ నాయుడు మధు రాయల్ మార్పు రమేష్.గంగరాజు,సంజీవ,గంగిరెడ్డి గంగులప్పా ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.మధుసూదన్ నాయుడు ముఖ్య అతిథులుగ ఘనంగా ప్రారంభించడం జరిగింది.మొదటగ స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం ను ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్యకర్తలు,నాయకులతో కలసి మహానాడు లైవ్ ప్రోగ్రాం ను వీక్షించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.