BREAKING
చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. రహదారి భద్రతకు పోలీస్ కవచం కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం. శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. రహదారి భద్రతకు పోలీస్ కవచం కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం. శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
www.ntodaynews.com

మహిళల భద్రతే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 11:57 AM
10 వీక్షణలు

మహిళల భద్రతే లక్ష్యం

మహిళల భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యo.

నేరాల నివారణకు అవగాహన కార్యక్రమం 

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సి. బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలపై జరుగుతున్న నేరాలపై శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి  మాట్లాడుతూ...

మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 

మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తోందని తెలిపారు. 

ఎవరైనా మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎంపీడీఓ ఎం. రాణెమ్మ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, మహిళలు తమ హక్కులు తెలుసుకుని ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.

సి.బెళగల్ ఎంఆర్ఓ వెంకట లక్ష్మి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని, సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించాలని తెలిపారు.

కోడుమూరు సీఐ తబ్రేజ్  మాట్లాడుతూ...

మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మహిళల భద్రతకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సి. బెలగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పాల్గొన్నారు. 

జిల్లా పోలీస్ కార్యాలయం, కర్నూలు