BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

మహిళల భద్రతే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 11:57 AM
98 వీక్షణలు

మహిళల భద్రతే లక్ష్యం

మహిళల భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యo.

నేరాల నివారణకు అవగాహన కార్యక్రమం 

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సి. బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలపై జరుగుతున్న నేరాలపై శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి  మాట్లాడుతూ...

మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 

మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తోందని తెలిపారు. 

ఎవరైనా మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎంపీడీఓ ఎం. రాణెమ్మ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, మహిళలు తమ హక్కులు తెలుసుకుని ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.

సి.బెళగల్ ఎంఆర్ఓ వెంకట లక్ష్మి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని, సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించాలని తెలిపారు.

కోడుమూరు సీఐ తబ్రేజ్  మాట్లాడుతూ...

మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మహిళల భద్రతకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సి. బెలగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పాల్గొన్నారు. 

జిల్లా పోలీస్ కార్యాలయం, కర్నూలు