BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 06:30 AM
102 వీక్షణలు

మదనపల్లి మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, వారిపై జరిగే నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా "ఆపరేషన్ దండాయన" కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'స్పీడ్ ట్రయల్ మానిటరింగ్' విధానాన్ని జిల్లాలో వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

మహిళలపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం 'జీరో టాలరెన్స్ విధానం' అవలంబిస్తోందని, నిందితులు ఎంతటి ప్రభావశీలురైనా చట్టం ముందు లొంగాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లాలో మహిళలపై నేరాలలో 16 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టం ద్వారా విచారణలో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పునరావృత నేరస్థులపై సెక్సువల్ అఫెండర్ షీట్లు' (SOS) తెరిచి, జియో ట్యాగింగ్ ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలపై జరిగిన నేరాల్లో కోర్టులు విధించిన కఠినమైన తీర్పుల వివరాలను పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.