ఏపీలో పీఎం సూర్యఘర్: బీసీలకు అదనపు సబ్సిడీ.. తెలుసుకోండి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పీఎం సూర్యఘర్ – ఉచిత విద్యుత్ పథకం కింద 2 కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే బీసీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు రాయితీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.60,000 సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 సబ్సిడీ అందించనుంది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.80,000 వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది.
ఈ ప్రయోజనం నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హ కుటుంబాలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27.2 లక్షల మంది లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ముఖ్య గమనిక:
ఈ విషయంపై అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సోలార్ వెండర్లు లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే ముందు ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ వివరాలు, మొత్తం ఖర్చు, మీ వాటా ఎంత అనే విషయాలను అధికారికంగా నిర్ధారించుకుని మాత్రమే చెల్లింపులు చేయండి.