396 జీవో రద్దు చేయాలంటూ జూలై 20 నుంచి పెన్డౌన్ సమ్మెకు పిలుపు
కడప నగరంలో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, దస్తావేజు లేఖరుల సహాయకుల సమావేశం సంజీవరాయుడు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకులు జూలై 20 నుంచి జూలై 31 వరకు చేపట్టనున్న పెన్డౌన్ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమావేశం అనంతరం జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పెన్డౌన్ సమ్మెకు సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించి, సమ్మె విజయవంతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.