BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి.. ఎండీఎం భోజనం రుచిగా, శుచిగా ఉండాలి: ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 03:36 PM
166 వీక్షణలు

చాట్రాయి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సీ. గుడిపాడు ఎంపీపీఎస్ ప్రధాన పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డులను పరిశీలించారు.

అనంతరం చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలకు హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై, అలాగే పాఠశాల పని వేళల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులు విడిచి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తదుపరి మధ్యాహ్న భోజన (ఎండీఎం) పథకం అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనాన్ని ఎల్లప్పుడూ రుచికరంగా, శుభ్రంగా తయారు చేసి విద్యార్థులకు వడ్డించాలని ఎండీఎం నిర్వహణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.

ఈ తనిఖీల్లో సీ. గుడిపాడు ప్రధానోపాధ్యాయురాలు హేమ నాగశ్రీ, చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి పాల్గొన్నారు.