BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ఇసుక రీచ్‌లు అందుబాటులో ఉన్నాయి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jul, 2026 - 03:40 PM
98 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ప్రజల గృహ నిర్మాణ అవసరాల కోసం 'మన ఇసుక వాహనం' ద్వారా అధికారికంగా నిర్వహిస్తున్న ముల్కల్ల, తాళ్లపల్లి, ఇందారం, బతుకమ్మ వాగు, కొల్లూర్ ఇసుక రీచ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని గనుల మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాబోయే వర్షాకాలంలో వర్షాల వల్ల రీచ్‌లు నడవని పరిస్థితి ఉంటుందని, కావున ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేవారు తమకు కావలసిన ఇసుకను ముందే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకొని ఇళ్ల వద్ద నిల్వ చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు.

​ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, లేదా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై మరియు వారికి సహకరించే వ్యక్తులపై కూడా కఠినమైన చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని సహాయ సంచాలకులు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు