www.ntodaynews.com
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్
తెలంగాణ
పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ను కరీంనగర్ ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీకి పంపేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.
అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.32.31 లక్షల విలువైన లెక్కల్లో చూపని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన నగదు మూలాలపై అధికారులు విచారణ చేపట్టారు.
నిందితుడిని అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.