BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

మహిళల భద్రతకు పెద్దపీట.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలే!

ఆంధ్రప్రదేశ్
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 09:48 AM
33 వీక్షణలు

మహిళల భద్రతకు పెద్దపీట.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలే!

పోలీసు అధికారులకు కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపిఎస్ గారి దిశానిర్దేశం.

 జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారిపై నేరాలకు డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్  పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారితో కలిసి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియుత్రణపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

డీఐజీ  కీలక ఆదేశాలు

ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారపై డేగకన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మహిళల నుండి విచ్చే పిర్యాదులపై ప్రతి అధికారీ తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు.

రౌడీషీటర్లపై ఉక్కుపాదం & రోడ్డు భద్రత

జిల్లాలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించవద్దని సూచించారు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్సీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి  మదనపల్లె డిఎస్సీ శ్రీమతి పావని గారితో పాటు పలువురు సీఐలు, మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.