BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

మహిళల భద్రతకు పెద్దపీట.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలే!

ఆంధ్రప్రదేశ్
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 09:48 AM
7 వీక్షణలు

మహిళల భద్రతకు పెద్దపీట.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలే!

పోలీసు అధికారులకు కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపిఎస్ గారి దిశానిర్దేశం.

 జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారిపై నేరాలకు డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్  పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారితో కలిసి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియుత్రణపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

డీఐజీ  కీలక ఆదేశాలు

ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారపై డేగకన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మహిళల నుండి విచ్చే పిర్యాదులపై ప్రతి అధికారీ తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు.

రౌడీషీటర్లపై ఉక్కుపాదం & రోడ్డు భద్రత

జిల్లాలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించవద్దని సూచించారు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్సీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి  మదనపల్లె డిఎస్సీ శ్రీమతి పావని గారితో పాటు పలువురు సీఐలు, మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.