www.ntodaynews.com
మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు
చింతలపూడి పట్టణంలోని చింతలపూడి–ఏలూరు రోడ్డులో గల మినీ బైపాస్ రోడ్డులో డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధిలో మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ డ్రైనేజ్ నిర్మాణంతో ప్రాంతంలో నీటి నిల్వ సమస్యలకు చెక్ పడటమే కాకుండా, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందించాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.