BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 18 March 2026, 02:13 pm
Posted by : V శ్రీనివాస్

99 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 02:13 PM
109 వీక్షణలు

99 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి - అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల, మార్చి 18: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు.

బుధవారం మంచిర్యాల పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి పట్టణంలోని పలు వార్డులలో పర్యటించిన అదనపు కలెక్టర్, పారిశుధ్య పనుల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో ముచ్చటించి, పట్టణంలో జరుగుతున్న శుభ్రత పనులు, చెత్త సేకరణ మరియు ఇతర పౌర సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సూచించారు