అనారోగ్యంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
మంచిర్యాల: అనారోగ్యంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
మంచిర్యాల, మే 26: తీవ్ర అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఒక రిటైర్డ్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
పాత మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఆడె భీమయ్య (68) సింగరేణి సంస్థలో పని చేసి పదవీ విరమణ పొందారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీని కోసం పలు ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం నయం కాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.
ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భీమయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ ప్రమోద్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి