www.ntodaynews.com
మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక..
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. జైపూర్ మండలానికి చెందిన రాములు అనే వృద్ధుడు శుక్రవారం రాత్రి భోజనం చేస్తుండగా ప్రమాదవశాత్తు మటన్ ఎముక గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు తక్షణమే స్పందించి పరీక్షలు నిర్వహించారు. ఎముక గొంతులో క్లిష్టమైన చోట ఇరుక్కున్నట్లు గుర్తించి, ఎండోస్కోపీ విధానం ద్వారా అత్యంత చాకచక్యంగా దానిని బయటకు తీశారు. సకాలంలో వైద్యం అందడంతో వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.