మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం.. SSC ఫలితాల్లో అద్భుత విజయం!
మంచిర్యాల జిల్లా మోడల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి (SSC) ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తమ సత్తా చాటారు. ఈ పరీక్షల్లో మంతెన సంజన 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ముజ్జేటి శ్రీవాని 576 మార్కులు, అంకం శ్రీ సాయి హర్ష 573 మార్కులతో మెరిశారు. పాఠశాల నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించగా, 32 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి పాఠశాల అకడమిక్ ప్రమాణాలను చాటిచెప్పారు. విద్యార్థుల ఈ విజయపై జిల్లా విద్యాశాఖ అధికారి డి. యాదయ్య హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.