www.ntodaynews.com
మంచిర్యాల ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో తహశీల్దార్ రఫత్ అధ్యక్షతన మంగళవారం ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓ) ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయబ్ తహశీల్దార్ గడియారం శ్రీహరి అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీఎల్ఓలు అత్యంత బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా పరిశీలించి నమోదు చేస్తూ, ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా 100 శాతం విజయవంతం చేయాలని ఆయన సూచించారు