www.ntodaynews.com
నార్కట్పల్లిలో రోడ్డు ప్రమాదం : వ్యక్తి మృతి
తెలంగాణ
/
నల్గొండ
/
నార్కెట్ పల్లి
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలోని జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ లింగోటం గ్రామానికి చెందిన వ్యాపారి పల్లగొర్ల లింగయ్య (50) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం లింగయ్య నార్కట్పల్లిలో పని ముగించుకుని తన ఎలక్ట్రిక్ స్కూటర్పై తిరిగి గ్రామానికి వెళ్తుండగా, హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునుగోడుకు చెందిన కారు డ్రైవర్ దోమలపల్లి రాజుపై నార్కట్పల్లి ఎస్ఐ పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.