BREAKING
భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి
www.ntodaynews.com

​నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 08:11 PM
12 వీక్షణలు

మంచిర్యాల (నస్పూర్): గ్రామస్థాయి నుంచే అభివృద్ధికి బాటలు వేసేలా అత్యుత్తమ, నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (ఐడీవోసీ) భవన సమావేశ మందిరంలో గ్రామ అభివృద్ధి ప్రణాళికపై డివిజనల్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ గణపతిలతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ ర్యాంకింగ్స్ సాధించే దిశగా పక్కా ప్రణాళికలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణ ద్వారా 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, పెసా గ్రామపంచాయతీలు, సభాసర్, నిర్ణయ్ యాప్, ఈ-గ్రామ స్వరాజ్ వంటి కీలక అంశాలపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు.

​పంచాయతీ కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరుకావాలని, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, గ్రామసభలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు పన్నులు సకాలంలో వసూలు చేయాలన్నారు. సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు వెంటనే అనువైన స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, అలాగే నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, దోమల వృద్ధిని అరికట్టేలా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామాలను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దేందుకు అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.జి.జి. కన్సల్టెంట్ మహేష్, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు