www.ntodaynews.com
ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర గౌరవం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
భారత ప్రధాని నరేంద్ర మోదీకు స్లోవేకియా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది. “ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్” (Order of the White Double Cross) అవార్డును స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని అందజేశారు.
ఈ పురస్కారం ద్వారా ఇప్పటివరకు మోదీ పొందిన అంతర్జాతీయ గౌరవాల సంఖ్య 33కు చేరినట్లు సమాచారం.
భారత్–స్లోవేకియా మధ్య స్నేహబంధం, ద్వైపాక్షిక సహకారాన్ని గుర్తిస్తూ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ గౌరవం భారత ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.