www.ntodaynews.com
మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 'బడి బాట' కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రం పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్.ఎం) సంగీత ఆధ్వర్యంలో, అంగన్వాడీ టీచర్ పద్మతో కలిసి సిబ్బంది ఇంటింటికీ తిరిగారు.
ఈ సందర్భంగా ఐదేళ్లు పూర్తయిన పిల్లలను గుర్తించి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకుని పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు