www.ntodaynews.com
మంచిర్యాల స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా సమిండ్ల రమేష్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా పట్టణానికి చెందిన సమిండ్ల రమేష్ను నియమించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ జిల్లా జ్యుడీషియల్ సెషన్స్ కోర్టు జడ్జి నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గత రెండు దశాబ్దాలుగా సమిండ్ల రమేష్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడేందుకు తన వంతు బాధ్యతగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు