BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

కర్ణమామిడి గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
03 Aug, 2026 - 05:45 PM
108 వీక్షణలు

కర్ణమామిడి గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ 

మంచిర్యాల నియోజకవర్గం

హజీపూర్ మండలంలోని కర్ణమామిడి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వర్షపు నీటి సంరక్షణకు ఉపయోగపడే ఇంకుడు గుంత నిర్మాణ పనులకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కిషన్, సురేఖ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట రవి, స్థానిక సర్పంచ్ బొడ్డు భూమయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.