మంచిర్యాలలో 200 అడుగుల బావిలో పడిన ఆవు.. 4 గంటల శ్రమించి రక్షించిన రెస్క్యూ టీం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో సోమవారం ఉదయం ఓ ఆవు ప్రమాదవశాత్తు సుమారు 200 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై కార్పొరేటర్ కస్తూరి నాగరాజుకు సమాచారం అందించారు.
కార్పొరేటర్ అగ్నిమాపక శాఖ మరియు రెస్క్యూ టీం అధికారులకు వెంటనే సమాచారం చేరవేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది.. మున్సిపల్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఆవును సురక్షితంగా బయటకు తీశారు.
ఆవు ప్రాణాలతో బయటపడటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి సమన్వయంతో ఆవు ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక, రెస్క్యూ మరియు మున్సిపల్ సిబ్బందిని పలువురు అధికారులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.