పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) జరుగుతున్న భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థులకు సకాలంలో నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని సూచించారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, రోజూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు