www.ntodaynews.com
మంచిర్యాలలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
నిబంధనలు పాటించని బస్సుపై కేసు నమోదు: డీటీవో గోపికృష్ణ
మంచిర్యాల: జిల్లాలో విద్యాసంస్థల బస్సులు నిబంధనలు పాటించడం లేదన్న నేపథ్యంలో, సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు లేకపోవడాన్ని గుర్తించి సదరు స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసినట్లు డీటీవో గోపికృష్ణ తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా సరైన ఫిట్నెస్ లేని బస్సులకు రోడ్డెక్కే అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై కూడా క్రమం తప్పకుండా ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని డీటీవో వెల్లడించారు.