BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

​ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 05:32 PM
83 వీక్షణలు

నస్పూర్ సమీకృత కలెక్టరేట్‌లో అర్జీల స్వీకరణ

అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఆర్ఓ మోతిరామ్‌లతో కలిసి సమస్యల పరిశీలన

ఇండ్లు, భూ సమస్యలు, సంక్షేమ పథకాల కోసం వెల్లువెత్తిన దరఖాస్తులు

​మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌లతో కలిసి ఆయన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితులకు సత్వరమే న్యాయం జరిగే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. చెన్నూర్ మండలం ఒతుకులపల్లికి చెందిన కావేరి శోభ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాలకు చెందిన సెగ్గెం ప్రసాద్ జీవనాధారంగా ఆటోతో పాటు రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలని కోరారు. తాండూరు మండలం అచలాపూర్‌లో అక్రమ కల్వర్టు నిర్మాణంతో తమ భూమి ఆక్రమణకు గురవుతుందని కట్ల పోసక్క, కట్ల పోచం ఫిర్యాదు చేయగా.. లక్షెట్టిపేట మండలం మోదెలలో గోదావరి ముంపునకు గురైన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని సత్యనారాయణ రావు అర్జీ సమర్పించారు. అలాగే, దేవాపూర్‌కు చెందిన వెంకటేశం తన కుమారుడికి వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో సీటు కేటాయించాలని, జైపూర్ మండలం ఇందారానికి చెందిన కళ్యాణి తనకు గృహజ్యోతి, గ్యాస్ రాయితీ పథకాలు వర్తింపజేయాలని వినతిపత్రాలు అందజేశారు