www.ntodaynews.com
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం.. ఐదుగురి అరెస్ట్ చేసిన CI
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు, జూన్ 15: అన్నమయ్య జిల్లా పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పుంగనూరు సీఐ తెలిపారు.
సికింద్రాబాద్కు చెందిన వెంకటరత్నంను రూ.50 వేల మేర మోసం చేసి, బెదిరింపులకు గురిచేసిన కేసులో నాగిరెడ్డి, ఆరుద్రయ్య, మహేష్ కుమార్, సయ్యద్ ఆదమ్ భాష, రెడ్డప్పలను పోలీసులు యూఎన్ఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.