BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి – చింతలపూడిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 08:07 PM
108 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి శ్రేణులు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాయి. పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో చేయని అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.

“అభివృద్ధి అంటే కూటమి, కూటమి అంటే అభివృద్ధి” అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిడిపి చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీదరాల దుర్గాపార్వతి మధుబాబు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టిడిపి జిల్లా నాయకులు, చింతలపూడి మండల అధ్యక్షులు చింతం విష్ణు, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.