కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి – చింతలపూడిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ
చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి శ్రేణులు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాయి. పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో చేయని అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.
“అభివృద్ధి అంటే కూటమి, కూటమి అంటే అభివృద్ధి” అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీదరాల దుర్గాపార్వతి మధుబాబు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టిడిపి జిల్లా నాయకులు, చింతలపూడి మండల అధ్యక్షులు చింతం విష్ణు, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.