మంచిర్యాలలో 24వ రోజుకు చేరిన 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తి, ఆకలి తీరుస్తున్న నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్
మంచిర్యాల: నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 24వ రోజుకు చేరుకుంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు పాల్గొని పేదలకు, బాటసారులకు పెరుగన్నాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ 24వ డివిజన్ నాయకులు రుక్కుం సుజాత-తిరుమల్, మాజీ సర్పంచ్ ఐతే శంకర్, శెట్టి రమణ, పెద్దపల్లి రాములు, కంది మల్లేష్, రుక్కుం శేషంక్, అగ్గి శ్రీమాన్, అలాగే 54వ డివిజన్ నాయకులు జక్కం జగన్, ముదం సాయి కుమార్, కావేటి రాజు, గగ్గురి రాజు కుమార్, పైడిపెల్లి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సేవలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నక్క తిరుపతి, MA. జావిద్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు