BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

మంచిర్యాలలో బీజేపీ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 May, 2026 - 05:24 PM
58 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీలలో జిల్లా స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు రాజకీయ, సంస్థాగత అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మంచిర్యాల పట్టణంలోని సుచిత్ర ఇన్ కన్వెన్షన్‌లో జరగనున్న ఈ శిక్షణా తరగతులకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమగ్ర అవగాహన కల్పించేలా రూపొందించినట్లు తెలిపారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో మొత్తం 12 విభాగాలను ఏర్పాటు చేసి, ప్రతి విభాగంలో పార్టీకి సంబంధించిన కీలకమైన 12 అంశాలపై లోతైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చా గోష్టులు నిర్వహించనున్నారని చెప్పారు.

పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయని జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమ విజయవంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా నాయకత్వం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.