BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

మంచిర్యాలలో దారుణం: మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపిన వలస కూలీలు

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 02:56 PM
52 వీక్షణలు

మంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దీపక్ అనే వలస కూలీ, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మంచిర్యాలలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వీరంతా కలిసి మద్యం సేవించిన సమయంలో వారి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మిగిలిన ఇద్దరు వ్యక్తులు దీపక్ పై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు.

తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న దీపక్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దీపక్ మృతి చెందినట్లు సీఐ ప్రమోద్ రావు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.