మంచిర్యాలలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు
మంచిర్యాలలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎర్రజెండాను ఆవిష్కరించి చికాగో అమరవీరులకు నివాళులర్పించి, మే డే స్ఫూర్తితో విశ్రాంత ఉద్యోగుల సమస్యలైన పెన్షన్ పెంపు, మెడికల్ సౌకర్యాలు, గ్రాట్యుటీ సాధన కోసం పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రభుత్వం సింగరేణి బకాయిలను చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని మరియు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, కార్యదర్శి అడిచర్ల రాజేశం, నాయకులు జి. లక్ష్మణ్, రాజన్న గౌడ్, రాజు గారు, చారి, నారాయణ తదితరులు పాల్గొని అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేశారు