BREAKING
​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం
www.ntodaynews.com

పోతనపల్లి గ్రామంలో గ్రామ దేవతలకు మొక్కుబడులు చెల్లించిన బంజారాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 12:33 PM
61 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో బంజారా సమాజం సభ్యులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం గ్రామ శాంతి, సుభిక్షం కలగాలని కోరుతూ అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ సీనియర్ నేత దేశరెడ్డి రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ కారంగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ దేవతల పూజలు గ్రామ ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.

పూజల అనంతరం గ్రామ పెద్దలు, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.