www.ntodaynews.com
పోతనపల్లి గ్రామంలో గ్రామ దేవతలకు మొక్కుబడులు చెల్లించిన బంజారాలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో బంజారా సమాజం సభ్యులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం గ్రామ శాంతి, సుభిక్షం కలగాలని కోరుతూ అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ సీనియర్ నేత దేశరెడ్డి రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ కారంగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ దేవతల పూజలు గ్రామ ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.
పూజల అనంతరం గ్రామ పెద్దలు, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.