www.ntodaynews.com
పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతి కన్నీరు మున్నీరైన రైతు కుటుంబం
తెలంగాణ
జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో మందాటి కొండల్ రెడ్డి అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు అక్కడికక్కడే మృతి చెందింది.
సుమారు రూ.1 లక్ష విలువైన ఎద్దు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వ్యవసాయ పనుల కోసం, ముఖ్యంగా వర్షాకాలంలో పొలాలు దున్నేందుకు ఇటీవలే ఆ ఎద్దును కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.