www.ntodaynews.com
మందమర్రి పీఎస్లో బాల్క సుమన్పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
తెలంగాణ
/
మంచిర్యాల
/
మందమర్రి
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై మందమర్రి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండీ నయీం, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మరియు మండల అధ్యక్షుడు సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ ఫిర్యాదును అందజేశారు.
సమాజంలో విధ్వంసం సృష్టించేలా, కార్యకర్తలను రెచ్చగొట్టేలా బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు