www.ntodaynews.com
మంగినపూడి బీచ్లో 63 అడుగుల మట్టి వినాయకుడు
ఆంధ్రప్రదేశ్
/
కృష్ణా
మంగినపూడి బీచ్లో 63 అడుగుల మట్టి వినాయకుడు
మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఉత్సవ కమిటీ ఏర్పాటు
మచిలీపట్నం మంగినపూడి బీచ్లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 63 అడుగుల మట్టి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వినాయక చవితిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటుతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.