www.ntodaynews.com
మంగళగిరి ఏసీఏ స్టేడియంకు రేపు రామ్చరణ్
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఏపీఎల్ సీజన్-5 పోటీలు ఈనెల 24 నుంచి 30 వరకు జరగనున్నాయి. మంగళగిరిలో జరిగే తొలి ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్చరణ్ హాజరుకానున్నారు.
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లకు కూడా మంగళగిరి ఏసీఏ స్టేడియమే వేదిక కానుంది. పోటీల నిర్వహణకు స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) కృషితో స్టేడియానికి అంతర్జాతీయ స్థాయి హంగులు సమకూరాయి. స్టేడియంలోని 75 గదులను ఆధునిక వసతులతో అభివృద్ధి చేశారు.
ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.