www.ntodaynews.com
మొదటి వేటలోనే ఇలస చేప – అంతర్వేది హార్బర్లో వేలం రూ.4,500
ఆంధ్రప్రదేశ్
రెండు నెలల విరామం తర్వాత సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు మొదటి వలలోనే ఇలస చేప దొరికింది. ఈ చేపను అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో గురువారం వేలం వేయగా రూ.4,500కు కొనుగోలు చేశారు.
గోదావరిలో వరదల సమయంలో ఇదే ఇలస చేప పులసగా మారి దొరికితే ధర భారీగా పెరిగి రూ.30 వేలకు పైగా పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు.