మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ..
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేత
చీపురుగూడెం పంచాయతీ పరిధిలోని మర్రిబంధం గ్రామంలో గురువారం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన ఆర్సీఎం చర్చి ప్రార్థనా కార్యక్రమంలో మండల నాయకుడు బొట్టు లక్ష్మణరావు పాల్గొన్నారు. ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గ్రామ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు.
ఈ సందర్భంగా చర్చి అభివృద్ధి పనులకు తన వంతు సహకారంగా రూ.20,000 నగదును అందజేశారు. “ప్రార్థనా మందిరాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి.. వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి” అని లక్ష్మణరావు పేర్కొన్నారు.
లక్ష్మణరావు చేసిన సహాయంపై చర్చి ఫాదర్లు, గ్రామ పెద్దలు, క్రైస్తవ సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే లక్ష్మణరావు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారని గ్రామస్తులు కొనియాడారు.