www.ntodaynews.com
బిర్యానీ హోటల్లో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ
ధర్మపురిలో స్టార్ బిర్యానీ హోటల్లో భారీ అగ్నిప్రమాదం
ప్రమాద స్థలాన్ని సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్
ధర్మపురి పట్టణంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని స్టార్ బిర్యానీ హోటల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి హోటల్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
సంఘటన స్థల పరిశీలన
సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాలిపోయిన హోటల్ సామాగ్రి, పరిసర ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను బాధితులు మరియు స్థానికుల నుంచి తెలుసుకున్నారు.
అగ్నిప్రమాదంలో నష్టపోయిన హోటల్ యజమానిని మాజీ మంత్రి పరామర్శించి, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులు అగ్నిమాపక భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#FireAccident
#Dharmpuri
#StarBiryaniHotel
#KoppulaEshwar
#TelanganaNews
#LocalNews
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube