www.ntodaynews.com
మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.. తాడిపత్రిలో వింత ఘటన..!
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.. తాడిపత్రిలో వింత ఘటన..!
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఒక వినూత్న సంఘటన చోటుచేసుకుంది. ఉగాది సందర్భంగా ఓ వ్యక్తి మటన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ మటన్ను సుమారు 20 సార్లు ఉడికించినప్పటికీ ఉడకకపోవడంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.
దీంతో ఆగ్రహానికి లోనైన అతడు, మటన్ విక్రయదారుడిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుని, వండిన పాత్రతో సహా నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించడంతో వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఈ ఘటనపై పోలీసులు అతనికి సర్ది చెప్పి, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఆ వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.