www.ntodaynews.com
మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : ఎంపీ గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ గురుమూర్తి విమర్శించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన ఎంపీ గురుమూర్తి.. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి శాటిలైట్ ఫోన్లు అందించాలని డిమాండ్ చేశారు. బోట్లలో నావిగేషన్ వ్యవస్థ, పవర్ బ్యాకప్ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
మత్స్యకారుల ప్రాణ రక్షణ కోసం ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.